నరేంద్రమోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం.. వేల్పులగోపాల్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బిజెపి కర్నూలు జిల్లా కల్లూరు రూరల్ మండల అధ్యక్షులు కె యస్ మధుకుమార్ బిజెపి నాయకులు వేల్పులగోపాల్ మాట్లాడుతూ చిన్నటేకూరు ఉల్లిందకొండ మధ్య మార్గంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము భారత ప్రధాని శ్రీనరేంద్రమోడి చనిపోయిన ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు క్షత గాత్రులకు యాబైవేల రూపాయలు ప్రకటించారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మెరుగైన వైద్యం అందించాలని కర్నూలు జిల్లా వైద్య సిబ్బంది తెలియజేశారు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పివియన్ మాధవ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ క్షత గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి బస్సు దగ్ధమైన ఘటనలో ఎక్కువ మంది మృత్యువాత పడడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈఘటనలో బాధితులకు సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర జిల్లా పార్టీ ఆదేశాలు క్షత గాత్రుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు రాష్ట్ర జిల్లా బిజెపి నాయకులు ఘటన స్థలం పరిశీలించి అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి పోయి క్షత గాత్రులను పరామర్శించి సహాయ సహకారాలు కోసం మా పార్టీ నాయకులు ఎల్లవేళలా మీకు సహకులుగా ఉంటారన్నారు.

