ప్యాపిలి విద్యార్థినికి శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ లో సీటు
1 min read

ప్యాపిలి , న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని బాలికల పాఠశాల కి చెందిన షేక్ కౌసర్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 565 మార్కులతో సత్తా చాటి శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ క్యాంపస్లో సీటు పొందారు. పేద కుటుంబానికి చెందిన కౌసర్ ను ప్రధానోపాధ్యాయురాలు సరళాదేవి, ఉపాధ్యాయులు అభినందించారు. ప్యాపిలిలో మరో ముగ్గురు విద్యార్థినులు కూడా త్రిబుల్ ఐటీ సీట్లు సాధించినట్లు ఎంఈవో వెంకటేశ్ నాయక్ తెలిపారు.

