ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హానికరం
1 min read
మోండలీస్ అసిస్టెంట్ మేనేజర్ రవీంద్ర
కొప్పుల వారి గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణానికి అనర్ధమని మొండలీస్ అసిస్టెంట్ మేనేజర్ రవీంద్ర అన్నారు. గురువారం పెదవేగి మండలం కొప్పుల వారి గూడెం గ్రామపంచాయతీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడానికి మొక్కల పెంపకం ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడే పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని ఆయన అన్నారు. మొండలీజ్ కంపెనీ గ్రామాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు.అనంతరం పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో అప్రో సంస్థ ప్రాజెక్టు మేనేజర్ పి.విజయ్ ప్రసాద్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసునూరి రమేష్, సస్టైనబుల్ కో-ఆర్డినేటర్ సిహెచ్. చినబాబు పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.