NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ శ్రీ విజయ దుర్గ కార్డియాక్​ ’లో..  స్టెంట్​ సక్సెస్​..

1 min read

రోగి గుండెకు మూడు రక్తనాళాలు పూడుకుపోయాయి..

  • స్టెంట్లు వేసి.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
  • వెల్లడించిన హాస్పిటల్​ ఎం.డి. డా. వసంత కుమార్​

కర్నూలు హాస్పిటల్​, న్యూస్​ నేడు :నగరంలోని శ్రీ విజయ దుర్గా హాస్పిటల్​ లో అరుదైన చికిత్స చేసి… విజయం సాధించారు. గుండెకు సంబంధించి మూడు రక్తనాళాలు పూడుకుపోవడంతో… గుండె నొప్పితో బాధ పడుతున్న సదరు రోగి శ్రీ విజయ దుర్గా హాస్పిటల్​ లో చికిత్స నిమిత్తం చేరారు.  ఆప్టికల్​ కొహెరెన్స్​ టోమోగ్రఫీ( ఓసీటీ) ద్వారా రోగి గుండెకు సంబంధించి మూడు రక్తనాళాలు బ్లాక్​ అయినట్లు నిర్ధారించిన శ్రీ విజయ దుర్గా హాస్పిటల్​ వైద్యులు.. ఒకేసారి మూడు స్టెంట్లు వేసి రోగి ప్రాణాలు కాపాడారు.  శుక్రవారం హాస్పిటల్​ ఎం.డి. కార్డియాక్​ వైద్యులు డా. వసంత కుమార్​, డా. అనిరుధ్​ కుమార్​  మీడియాకు వివరాలు వెల్లడించారు. కర్నూలుకు చెందిన వృద్ధుడు ( 68) గత కొన్నేళ్లుగా గుండె నొప్పితో బాధపడుతూ ఉన్నాడు.  మే నెలలో చికిత్స నిమిత్తం వచ్చిన ఆ వృద్ధుడి గుండెకు మూడు రక్త నాళాలు బ్లాక్​ అయినట్లు ఓసీటీ విధానం ద్వారా గుర్తించారు. ఈ విధానంలో ఎక్కడ బ్లాక్​ అయింది… ఎంత మేరకు ఉంది.. పొడవు, వెడెల్పు ఎంత తదితర అంశాలపై నిర్ధారణకు వచ్చారు.  ఆ తరువాత ఓసీటీ విధానంలో అతడి గుండెకు మూడు వాల్వ్​ లు వేసేందుకు అనుకూలంగా ఉండటంతో స్టెంట్లు వేశామని తెలిపారు. ఆధునిక  పరికరాలతో… నూతన చికిత్స విధానం హైదరాబాద్​, బెంగుళూరు వంటి నగరాల్లో మాత్రమే నిర్వహిస్తారని, ఇప్పుడు కర్నూలులోని తమ హాస్పిటల్​లో కూడా చికిత్స చేసి… విజయం సాధించినట్లు శ్రీ విజయ దుర్గా హాస్పిటల్​ అధినేత,  సీనియర్​ కార్డియాక్​ వైద్యులు డా. వసంత కుమార్​, డా. అనిరుధ్ కుమార్​ వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *