NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైలం దేవస్థానానికి సూర్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీ మినీ బస్ విరాళం

1 min read

మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వాహనం తాళాలు అందజేత

ఉండవల్లి, న్యూస్ నేడు:  భక్తుల సౌకర్యార్యం శ్రీశైలం దేవస్థానానికి విజయవాడకు చెందిన సూర్య కన్ స్ట్రక్షన్స్ కంపెనీ రూ.23 లక్షల విలువచేసే 25 సీట్ల సామర్థ్యం గల మినీ బస్ ను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వాహనం తాళాలను దేవస్థానం అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సూర్య కన్ స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావుతో పాటు 20 ళ్లసూత్రాల కమిటీ మాజీ ఛైర్మన్ వై.సాయిబాబు, శ్రీశైలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (A.E.O) కె.వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఆర్.మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

About Author