కర్నూలు ఎంపీ ని కలిసిన టిడిపి యువనేత మంజునాథ్ గౌడ్”..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆదోని పట్టణంలో టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు వారి నివాసంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గని మర్యాదపూర్వకంగా కలిసి శాలువ, పూలమలతో సత్కరించిన టీడీపీ యువ నేత మంజునాథ్ గౌడ్. యువ నేత మంజునాథ్ గౌడ్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో హోళగుంద మండలం వెనకబడిన ప్రాంతమని రోడ్లు, త్రాగునీరు సమస్య ఉంది అని అభివృద్ధి లేక చాలా నష్టపోతున్నారని మా మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరడం జరిగింది. కర్నూలు ఎంపీ బస్తిపటి నాగరాజు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో ఆరు మండలల అభివృద్ధికి కృషి చేస్తానని ఏ మండలంలో కూడా ఒక్క సమస్య కూడా లేకుండా చూసుకుంటానని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు, అండగా ఉంటారని చెప్పడం జరిగింది.


