పట్టు వీడని విక్రమార్కుడు…
1 min read

పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్
హొళగుంద, న్యూస్ నేడు: మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రాజశేఖర్ గౌడ్ పది రోజుల క్రితం కోడుమూరుకు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గా, డిప్యూటీ ఎంపీడీవో విధులు నిర్వహిస్తున్న చక్రవర్తి కార్యదర్శిగా కొనసాగాడు, ఆ స్థానంలో మేజర్ గ్రామపంచాయతీ, కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలని అధికారులు, రాజశేఖర్ గౌడ, హొళగుంద లో విధులను సక్రమంగా నిర్వహించే కార్యదర్శిగా గ్రామ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి సహనంతో సమాధానం చెప్పి ప్రజల మన్ననలను, పొందాడు పంచాయతీకి, సానిటేషన్ మేస్త్రి లేకపోవడంతో, తెల్లవారుజామున 5 గంటలకు పంచాయతీకి చేరుకుని సిబ్బందితో పనులను సక్రమంగా నిర్వహించే వారు, కార్యదర్శిగా ఆరు సంవత్సరాల నుంచి విధులను నిర్వహిస్తున్నారు, పనితీరును బట్టి , డిపిఓ, భాస్కర్ ఆదేశాల మేరకు, అదే స్థానంలో మళ్లీ పట్టు వీడని విక్రమార్కుడి లాగా ఇదే గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శి గా బుధవారం చార్జ్ తీసుకున్నారు ఇది తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది వాటర్ మ్యాన్లు,సి, యల్లప్ప గోపాల్, రమేష్, అరుణ్, కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చలవాది పంపాపతి వార్డు నెంబర్ సుభాన్ వాడు నెంబర్ అబ్దుల్ రెహమాన్ వార్డ్ నెంబర్ ఎఫ్ అబ్దుల్ హమీద్,పంచాయతీ,సిబ్బంది,సంతోషం వ్యక్తం చేశారు.

