కస్తూరిబాయి బాలికల విద్యాలయం లో సీట్ల సంఖ్య పెంచాలి
1 min read
న్యూస్ నేడు హొళగుంద : హొళగుంద మండల కేంద్రం నందు స్థానిక కస్తూర్బాయి విద్యాలయం నందు విద్యార్థుల సీట్ల సంఖ్య పెంచాలని మాల మహానాడు నాయకులు, పెద్దహ్యాట వీరభద్ర ,కర్నూలు జిల్లా కలెక్టర్. పి రంజిత్ భాష,ను కోరారు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవక ఐదో తరగతికి అంకితం అవుతున్నారు, కావున పాఠశాల సీట్లు పెంచి పేద విద్యార్థులకు విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ ని కోరడం జరిగినది, కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కరిస్తానని సానుకూలంగా స్పందించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఉపేంద్ర, సతీష్, తదితరులు పాల్గొన్నారు.