లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min read

పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఆద్యంతం లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమై చివరి గంట వరకు అదే ఒరవడి కొనసాగించాయి. అంతర్జాతీయంగా సానుకూలత.. దేశీయంగా ఎలాంటి ప్రతికూలత లేని నేపథ్యంలో సూచీల జోరు కొనసాగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో 57943 వద్ద, నిప్టీ 103 పాయింట్ల లాభంతో 17325 వద్ద ముగిసింది.

