తులశమ్మ వర్ధంతి..రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ
1 min read

మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బన్నూరు చంద్రారెడ్డి సతీమణి కీ.శే. బన్నూరు తులశమ్మ 5వ వర్ధంతి సందర్భంగా రోగులకు పాలు,పండ్లు,బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.గురువారం సాయంత్రం మిడుతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రోగులకు జనరల్ సర్జన్ డాక్టర్ అశ్విన్ తో కలిసి భర్త చంద్రారెడ్డి,కుమారుడు పార్థసారథి,ఎస్ ఈశ్వర్ రెడ్డి,తులసి,జయ తులసి రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు మరియు పండ్లను అందజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

