మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రైతులకు సన్మానం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మహిళా దినోత్సవం సందర్బంగా అమ్మ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు మహిళా రైతు ను సన్మానించారు. అమ్మ పాఠశాల లో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా పొలాల్లో పనిచేస్తున్న మహిళా రైతు ను సాధారంగా వేదికపై ఆహ్వానం పలికి దాదాపు 11 మంది మహిళా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎస్కే బాను , స్థాపకులు ఎల్కే చిన్నప్ప కలిసి సన్మానం చేసిరి. ఈ సందర్బంగా మహిళా రైతు లక్ష్మి మాట్లాడుచు ఈ పాఠశాల మహిళలకే కాక మా లాంటి రైతు లను రైతు కూలీలను చాలా గౌరవం ఇస్తారు అంటూ మాకు చాలా చాలా గౌరవం లభిస్తుంది అని చెప్పిరి డిగ్నినిటి ఆఫ్ లేబర్ అన్నది ఈ పాఠశాలలో చూస్తున్నామని తెలిపిరి మహిళా మణులకు మ్యూజికల్ చైర్, లైం మరియు స్పూన్, దారం సూది ఆటలను నిర్వహించిరి.అమ్మ స్కూల్.

