NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలను పరిష్కరించండి

1 min read

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వండి

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

ప్రజా ఫిర్యాదుల’ స్వీకరణకు 14 అర్జీలు

కర్నూలు, న్యూస్​ నేడు:  సోమవారం నగర ప్రజల నుంచి వివిధ రూపాల్లో అందుతున్న అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్య తీవ్రత, పరిష్కార మార్గాలను పరిశీలించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులకు సూచించారు. కింది స్థాయి ఉద్యోగులపై భారం ఉంచేసి, సాంకేతికంగా సమస్యను పరిష్కరించినట్లు చూపడం సరికాదని, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య ప్రాంతాన్ని సందర్శించినప్పుడు సమస్యను పూర్తిగా గ్రహించి, పరిష్కారం కనుగొనడం సులభమవుతుందన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను నిర్దేశిత గడువులోపు శాశ్వతంగా పరిష్కరించి, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచుదామని కమిషనర్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 14 అర్జీలు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ & ఆర్వో జునైద్, ఎస్ఈ రమణమూర్తి, ఇంచార్జీ సిటి ప్లానర్ వై.వి. వెంకటరమణ, ఆర్వో స్వర్ణలత, వాజిద్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *