NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేప‌ర్ లీక్.. కానిస్టుబుల్ ప‌రీక్ష ర‌ద్దు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను పరీక్ష రద్దు చేసింది. పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చ‌ర్య తీసుకుంది. దాదాపు 10,300 మంది ఈ పరీక్షలకు హాజరు అవుతున్నారు. 22 జిల్లాల్లోని మొత్తం 35 సెంటర్లలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు వచ్చాయని, దాని కారణంగానే పరీక్షను రద్దు చేశామని ప్రకటించింది. అయితే పరీక్ష రద్దయినందుకు అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, త్వరలో మళ్లీ కొత్తగా షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.

About Author