మండల విద్యాధికారి మాలతిని సన్మానించిన ఉపాధ్యాయులు
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ : పత్తికొండ మండల విద్యాశాఖ అధికారి -1గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి మాలతిని పత్తికొండ మండల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టియు )శాఖ గౌరవపూర్వకంగా కలిసి ఆమెకు పూల మాల వేసి శాలువా తో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు .మండలంలో ప్రభుత్వ విద్యా పరిరక్షణకై కలిసి పనిచేయాలని,మండలంలో ఉపాధ్యాయులకు , విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సంఘనాయకులకు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ యూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వామనగిరి చంద్రశేఖ ర్, ఎస్టియు జిల్లా కౌన్సిలర్ బలరాముడు,మండల ఎస్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆవుల నాగరాజు, మారుతి, మండల ఆర్థిక కార్యదర్శి మండ్ల వెంకటేశ్వర్లు, ఎస్టియు సీనియర్ నాయకులు కౌలుట్లయ్య, ఇక్బాల్ హుస్సేన్, మహిళనాయకు రాలు అరుణ,నీలిమ మరియు యువ ఎస్టియు నాయకులు పాల్గొన్నారు.

