భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం
1 min read
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల కిషోర్, ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్
ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి కి వినతి పత్రం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిలో ఎస్ స్సీ ,ఎస్ట్ ,బీసీ వర్గాలకు సముచిత భాగస్వామ్యం, పారిశ్రామిక యాజమాన్య అవకాశాలు,ఉపాధి కల్పించే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి కి అందజేశారు.భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమంతో ప్రతి శుక్రవారం ప్రజల నుంచి సమస్యలు స్వీకరిస్తూ పర్యటనలు చేస్తున్న సందర్భంలో పారిశ్రామిక రంగంలో ఎస్సీ ,ఎస్ట్ ,బీసీ ల భాగస్వామ్యం తగినంత లేకపోవడం పై ఆయా సంఘాలు, కులపెద్దలు ఆందోళన చెందుతున్నాయి. వీటి పరిష్కారం కొరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్, ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, జనతా వారిధి కన్వీనర్ నగరపాటి సత్యనారాయణ నెరసు నెలరాజా,బాడిత నారాయణరావు, కోటప్రోలు కృష్ణ , ఎస్ ఆర్ ఆర్ రాజుబాడిత నారాయణరావు, ఏలూరు బిజెపి మీడియా కన్వీ నర్ తదితర కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.


