PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోల్ కీప‌ర్ శ్రీజేష్ కు ఆఫ‌ర్ల వెల్లువ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్​ : భారత హాకీ జ‌ట్టు గోల్ కీప‌ర్ శ్రీజేష్ కు కేర‌ళ ప్రభుత్వం భారీ న‌జ‌రాన ప్రక‌టించింది. టోక్యో ఒలంపిక్స్ లో శ్రీజేష్ కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. కాంస్యం పోరులో అద్భుత ప్రద‌ర్శన చేశారు. శ్రీజేష్ కు కేర‌ళ ప్రభుత్వం 2 కోట్ల భారీ న‌జ‌రాన ప్రక‌టించింది. అంతేకాకుండా విద్యాశాఖ‌లో జాయింట్ డైరెక్టర్ గా నియ‌మించ‌నున్నట్టు తెలిపింది. కాంస్యం పోరులో భారత్, జ‌ర్మనీ జ‌ట్లు నువ్వా.. నేనా అన్నట్టు పోరాడాయి. ఈ మ్యాచ్ లో జ‌ర్మనీని భార‌త్ 5-4 తేడాతో ఓడించింది. దీంతో 41 ఏళ్ల త‌ర్వాత భార‌త్ ప‌త‌కాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో జ‌ర్మనీ జట్టు గోల్ పోస్ట్ వ‌ద్ద ప‌దేప‌దే దాడులు చేసిన‌ప్పటికీ శ్రీజేష్ అస‌మాన పోరాట ప‌టిమ ప్రద‌ర్శించాడు.

About Author