బాలిరెడ్డికి నివాళులు అర్పించిన సిద్ధార్థ రెడ్డి
1 min read
మిడుతూరు (నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామ పెద్దలు బీరం బాలిరెడ్డి (85)తెల్లవారు జామున మృతి చెందారు.విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డిసిద్దార్థరెడ్డి గ్రామానికి చేరుకుని బాలిరెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యాక్రమంలో జడ్పిటీసీ పర్వత యుగంధర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి,మండల కన్వినర్ తువ్వా లోకేశ్వర రెడ్డి,గోపాల్ రెడ్డి,బలరాముడు,సుదర్శన్ రెడ్డి,శ్రీనివాసులు,హరీష్,సాంబశివుడు,షేక్ అహ్మద్ పాల్గొన్నారు.


