PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

1 min read

పల్లెవెలుగు ఆదోని రూరల్ : లారీ-స్కూటర్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం పట్టణంలోని ఎమ్మిగనూరు జాతీయ రహదారి బైపాస్ సమీపంలో చోటు చేసుకుంది. మండలంలోని కపటి గ్రామానికి చెందిన బోయ నాగేష్(35) అనే వ్యక్తి ఏపీ21బిజె 2991 నెంబర్ గల ద్విచక్రవాహనంపై వంటగ్యాస్ తెచ్చుకునేందుకు పట్టణానికి రాగా, మిత్రుని దుకాణం వద్దకు వెళ్లి కబుర్లు చెప్పుకున్న తరువాత గ్యాస్ సిలిండర్ తీసుకుని వెళ్తానని మిత్రునితో చెప్పి తిరిగి వెళ్ళిన క్షణాల్లోనే అటువైపు నుంచి అతి వేగంగా వచ్చిన గ్యాస్ లారీ ఢీ కొంది. ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలగా అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు బోయ నగేష్ వృత్తి కోసం ముంబైలో ఉండేవాడని శ్రావణమాసం అయినందున ఉరుకుంద ఈరన్న స్వామి మొక్కుబడులు తీర్చుకునేందుకు సొంత గ్రామానికి రావడం జరిగింది. బోయ నాగేష్ మృతిపట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు,ఒక కుమారుడు ఉన్నారు.

About Author