PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చింతలముని స్వామి రథోత్సవంలో విషాదం..

1 min read

– కలశంకు విద్యుత్​ తీగలు తగిలి… ఇద్దరి మృతి
పల్లెవెలుగు వెబ్​, ఆదోని టౌన్​ : కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని పెసల బండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని పెసల బండ గ్రామంలో బుధవారం చింతల మునిస్వామి రథోత్సవం జరుగుతోంది. ఉదయం 9.30 గంటలకు స్వామి రథోత్సవం జరుగుతుండగా.. రథోత్సవంపై ఉన్న కలశం విద్యుత్​ తీగలు తగిలింది. ఈ ఘటనలో శెట్టి బలిజ వెంకటేష్​, విద్యార్థి వీరాంజనేయులు మృతి చెందారు. గోపాల్​, ఆంజనేయులు, సాయితేజకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి, ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఎస్​ఐ విజయలక్ష్మి, జయ మనోజ్​ రెడ్డి బాధితులను పరామర్శించారు. ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు పట్టించుకోకపోవడం.. ఆలయ కమిటీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, మృతుల కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పెసలబండ గ్రామస్తులు కోరారు.


About Author