PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెంటిలేట‌ర్ పై సాయి ధ‌ర‌మ్ తేజ్.. బైక్ యాక్సిడెంట్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ సినీ న‌టుడు, మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయ‌ప‌డ్డారు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సాయి ధ‌రమ్ తేజ్ ప్రమాద‌వ‌శాత్తు కింద‌ప‌డిపోయారు. దీంతో ఆయ‌న‌కు తీవ్రగాయాల‌య్యాయి. ప్రమాదం జ‌రిగిన వెంట‌నే సాయి ధ‌ర‌మ్ తేజ్ అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా స‌మీపంలో ఈ ప్రమాదం జ‌రిగింది. ప్రమాద స‌మ‌యంలో హెల్మెట్ ధ‌రించి ఉన్నప్పటికీ .. ప్రమాద తీవ్రత కార‌ణంగా బ‌ల‌మైన గాయాల‌య్యాయి. వెంట‌నే స్పందించిన స్థానికులు పోలీసుల స‌హాయంతో మెడిక‌వ‌ర్ ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం త‌రలించారు.
రోగ్యం నిల‌క‌డ‌గా ఉంది :
సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని అపోలో వైద్యులు తెలిపారు. శ‌రీరంలో ఎలాంటి అంత‌ర్గత గాయాలు అవ్వలేద‌ని , కాల‌ర్ బోన్ మాత్రమే విరిగింద‌ని తెలిపారు. ఇంకా ఆయ‌న 48 గంట‌లు వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో ఉండాలని, ప్రస్తుతం వెంటిలేట‌ర్ పై చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు.
అపోలో ఆస్పత్రికి త‌ర‌లివ‌చ్చిన మెగా ఫ్యామిలీ :
రోడ్డు ప్రమాదం జ‌రిగిన విష‌యం తెలియగానే సాయి ధ‌ర‌మ్ తేజ్ కుటుంబ స‌భ్యులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు, వ‌రుణ్ తేజ్, నిహారిక‌, వైష్ణవ్ తేజ్, ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్, న‌టుడు సందీప్ కిష‌న్ అపోలో ఆస్పత్రికి చేరుకుని సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.

About Author