PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాగణపతికి విద్యార్థులు ప్రత్యేకపూజలు

1 min read


పల్లెవెలుగువెబ్​ కర్నూలు: శరీన్​నగర్​లోని సద్గురు త్యాగరాజ సీతారామాలయంలో విజ్ఞాన వికాస్​ బాలసంస్కార కేంద్రం విద్యార్థినీ విద్యార్థులు శుక్రవారం మహాగణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్​ మాతృశక్తి నగర కన్వీనర్​ మాళిగి భార్గవి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు మహాగణపతికి సేవా కార్యక్రమాలు జరిపారు. విద్యలో ఉన్నత శిఖరాలకు చేరుకునే భాగ్యం కలిగించాలంటూ పూజలు చేశారు. కన్వినర్​ మాళిగి భార్గవి మాట్లాడుతూ మహాగణపతిని 108నామాలతో పూజించి స్వామికి మహామంగళహారతి, భజనలు నిర్వహించారని, అనంతరం తీర్థప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు. కార్యక్రకమంలో సుమారు 60మంది బాల సంస్కార కేంద్రం విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author