PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినీ నిర్మాతలు ఏపీమంత్రి పేర్నినానితో భేటి!

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: తెలుగు సినీపరిశ్రమ నిర్మాతల బృందం రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. ఈమేరకు వారు ఆన్​లైన్​ టికెటింగ్​ విధానం, ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు. ఓవైపు జనసేన నేత, సినీహీరో పవన్​కళ్యాణ్​ ప్రభుత్వం పాలనతీరుపై తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటే…మరోవైపు ఇండస్ట్రీ ప్రముఖ నిర్మాతలు రాష్ట్ర మంత్రి పేర్నినానితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రిని కలిసిన వారిలో నిర్మాతలు దిల్​రాజు, బన్నివాసు, దానయ్య తదితరులు ఉన్నారు. అయితే పవన్​కళ్యాణ్​ వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతోన్న విధానం పట్ల ఇండస్ట్రీ పెద్దల నుంచి విముఖత వ్యక్తమవుతోందని మంత్రి నాని పేర్కొన్నారు.

About Author