PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఐటీ విద్యార్థి ధరణికి ఇన్​ఫోసిస్​ నుంచి పిలుపు! ఏడాదికి రూ.1.84కోట్ల ప్యాకేజీ వేతనం

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన చిన్నారి చెన్నై ఐఐటీ విద్యార్థిని ధరణికి ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ ఇన్​ఫోసిస్​ నుంచి పిలుపు వచ్చింది. సదరు విద్యార్థిని ఐఐటీ మూడో సంవత్సరంలో ఉండగానే ఆమె ప్రతిభను గుర్తించిన బెంగుళూరు ఇన్​ఫోసిస్​ సంస్థ ఏడాదికి రూ.1.84కోట్ల ప్యాకేజీ వేతనం ఇచ్చేందుకు ముందుకురావడం విశేషం. ధరణి పిన్న వయసులోనే ఐఐటీ విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుండడంతో ఆమె తల్లిదండ్రులు శివయ్య(నంద్యాల ట్రాఫిక్ పోలీసు), లక్ష్మీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధరణిపై కుటుంబసభ్యులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

About Author