PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లంఖీపూర్​ ఘటనపై ప్రియాంక పరామర్శకు పోలీసుల నిరాకరణ

1 min read

పల్లెవెలుగువెబ్​, ఢిల్లీ: ఉత్తర్రపదేశ్​లోని లంఖీపూర్​ఖిరి జిల్లాలో రైతుల ఆందోళన శిబిరంపైకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్​మిశ్రా కాన్వాయ్​ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందిన తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ నేత ప్రియాంకగాంధీ సోమవారం మృతుల కుటుంబాలను పరామర్శించే క్రమంలో పోలీసుల నుంచి అడ్డంకి ఎదురయింది. ప్రియాంక గాంధీ వాహనాన్ని సీతాపూర్​ వద్ద అక్కడి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రియాంక పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లఖీంపూర్​ఖీర్​ జిల్లాలో హింసాత్మక వాతావరణం నెలకొని ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం హోంశాఖ మంత్రి కాన్వాయ్​లోని వాహనాలు రైతుల నిరసన శిబిరంలోకి దూసుకెళ్లిన ఘటనతో ఆగ్రహించిన రైతులు వాహనాలను దగ్ధం చేశారు.

About Author