PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ పాలనలో రైతులకు రక్షణ లేదు! లోకేష్​

1 min read

పల్లెవెలుగువెబ్​, అనంతపురం: వైసీపీ పాలనలో రైతులకు సరైన రక్షణ లేకుండాపోయిందని, అధికారపార్టీ దౌర్జన్యాలకు రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతున్నారని టీడీపీ నేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ అన్నారు. ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మంత్రి శంకర్​నారాయణ అనుచరులు బెదిరించి భూములు లాక్కున్నారని తన ఆవేదనను సోషల్​ మీడియా ద్వారా వివరించారు. ఇందుకు నారా లోకేష్​ స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్​ రెడ్డి పాలనలో రైతులు తమకు న్యాయం చేయండని రోడ్డు పడుతున్నారని, ఈ కోవలోనే అనంతపురం జిల్లా రాజుపాలేనికి చెంచిన వేమారెడ్డి అనే రైతు భూమిని మంత్రి అనుచరులు దౌర్జన్యంగా లాక్కుని జేసీబీలతో గండికొట్టి పొలాల మీదుగా నీటిని మళ్లించడం దారుణమన్నారు. వేమారెడ్డికి తగిన న్యాయం చేయాలని లోకేష్​ డిమాండ్​ చేశారు.

About Author