PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మురికి కుంటలే… రహదారులు..

1 min read

– అవస్థలు పడుతున్న ధూళ్ల హరిజనవాడ ప్రజలు
పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: వీరబల్లి మండల పరిధిలోని ఒదివీడు గ్రామ పంచాయతీ ధూళ్ల హరిజనవాడ లో వర్షపు చినుకు పడితే వీధుల్లో చిత్తడి చిత్తడిగా మారుతోంది. కాసింత వర్షం కురిసైనా ముందు సిబ్యాల వంక వెనుక మాండవ్యనది ఉధృతంగా ప్రవహిస్తోన్న కారణంగా మధ్యలో ధూళ్ల హరిజనవాడ ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

పిల్లలను బడికి పంపలేని స్థితిలో ఉన్నారు. వీధులలో ఎక్కడ చూసినా మురికి నీటితో నిండి కుంటలుగా ఏర్పడి పారిశుద్ధ్యం పడకేసింది. దోమలు వృద్ధి చెంది సీజనల్​ వ్యాధులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ధూళ్ల హరిజనవాడ ప్రజలు కోరుతున్నారు.

About Author