PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుడ్ న్యూస్.. ఉద్యోగుల‌కు 30 రోజుల బోన‌స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కేంద్ర ప్రభుత్వం గ్రూప్ బి, సి ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఉత్పాద‌క ఆధారిత బోన‌స్ ప‌రిధిలోకి రాని కేంద్రప్రభుత్వ ఉద్యోగుల‌కు 30 రోజుల అనుత్పాద‌క ఆధారిత‌ బోన‌స్ ప్రక‌టిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -బి ప‌రిధిలోకి వ‌చ్చే నాన్ గెజిటెడ్ ఉద్యోగుల‌తో పాటు గ్రూప్ సి ఉద్యోగులంద‌రికీ ఇది వ‌ర్తిస్తుంద‌ని కేంద్రం ప్రక‌టించింది. 7 వేల నెల‌వారీ జీతం ఆధారంగా ఈ బోన‌స్ లెక్కిస్తారు. కేంద్ర పారామిల‌ట‌రీ ద‌ళాలు, సాయుధ ద‌ళాల్లోని అర్హులైన వారంద‌రికీ ఈ బోన‌స్ వ‌ర్తిస్తుంది. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ఒక్కో ఉద్యోగికి 6,907 రూపాయ‌లు బోన‌స్ గా రానుంది.

About Author