PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలును మహానగరంగా తీర్చిదిద్దుతాం

1 min read
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

  • ఎమ్మెల్యే ఎం.ఏ. హఫీజ్ ఖాన్, మేయర్ అభ్యర్థి బి.వై. రామయ్య
    పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : జగనన్న స్ఫూర్తితో కర్నూలు నగరాన్ని మహా నగరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఎం.ఏ. హఫీజ్ ఖాన్ , మేయర్ అభ్యర్థి బి.వై. రామయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక నగర కార్యాలయంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఏ. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ నూతనంగా గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులు రాబోయే కాలంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మంచి పేరు తెచ్చే లా పనిచేసి , ప్రజలు పార్టీపై కార్పొరేటర్ల పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవాలన్నారు. అనంతరం నగర మేయర్ అభ్యర్థి బి.వై. రామయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయదుందుభి మోగించిందన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పడ్డ కష్టం , ఈ ఎన్నికల్లో ఫలితాల రూపంలో ప్రతిబింబించిందని అన్నారు. రాబోయే రోజుల్లో కర్నూలు కార్పొరేషన్ కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల సహకారంతో కర్నూలు కార్పొరేషన్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి .. నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరానికి చెందిన వైకాపా కార్పొరేటర్లు , నగర నాయకులు , కార్యకర్తలు హాజరయ్యారు.

About Author