PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పునీత్ చివ‌రి మూవీ.. కీల‌క నిర్ణయం తీసుకున్న నిర్మాత‌లు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : క‌న్నడ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించే సమయానికి ఆయన నటిస్తున్న ‘జేమ్స్‌’ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో పాటు మరో చిత్రం ద్విత్వ డిసెంబర్‌లో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోందట. దాదాపు 60 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న జేమ్స్‌ మూవీలో పునీత్ బాడీ బిల్డర్‌గా నటిస్తున్నారు. దీని కోసమే ఆయన జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఈ క్రమంలోనే జిమ్‌ చేస్తుండగా గుండెపోటుతో ఆయన మరణించారు. ఇక జేమ్స్‌ మూవీ ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా.. ఆయన మృతి చెందడంతో సినిమా భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ మూవీకి సంబంధించి పునీత్ యాక్షన్ పార్ట్ పూర్తయిందట. అలాగే షూటింగ్‌ కూడా చాలా వరకు పూర్తి కావడంతో ఈ సినిమాను అభిమానుల కోసం వచ్చే ఏడాది ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

About Author