PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్‌ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

1 min read


పల్లెవెలుగు వెబ్: కుప్పంలో టీడీపీ నేతలపై దాడి జరిగిందని చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీల్నం సాహ్నికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ లేఖ రాశారు. కుప్పం మున్సిపాలిటీ 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేష్‌పై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని.. నామినేషన్ పత్రాలను చించివేశారని లేఖలో పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేసే కేంద్రం వద్దే దాడి జరిగిందని ఆరోపించారు. దాడిలో దాదాపు 30 మంది పాల్గొని వెంకటేశ్ ను తీవ్రంగా కొట్టారని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీకి విజ్ఞప్తి చేశారు. పోటీ చేసే అభ్యర్థులకు భద్రత కల్పించాలని..మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయూత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు లేఖలో కోరారు.

About Author