PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త బిల్లు తీసుకొస్తాం : మంత్రి బుగ్గ‌న

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌గ్రాభివృద్ధి ర‌ద్దు బిల్లును ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మండ‌లిలో ప్ర‌వేశ‌పెట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చట్టం తీసుకొచ్చామ‌ని  బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరగడం వల్ల గ‌తంలో విభజన సమస్య వచ్చిందని ఆయ‌న అన్నారు. దేవుడి దయ వల్ల తెలంగాణ ఎక్కడా వెనక పడలేదన్నారు. అభివృద్ధి చెందనిది తెలంగాణ కాదని,  రాయలసీమ, ఉత్తరాంధ్ర అని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ వంటి కేంద్ర సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే స్థాపించారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర సంస్థలు మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారన్నారు.

About Author