PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేప‌టి నుంచి.. ఉద్యోగుల విధుల బ‌హిష్క‌ర‌ణ

1 min read

పల్లెవెలుగు వెబ్​: విజ‌యవాడ‌లోని ఎన్టీఆర్  యూనివ‌ర్శిటీ ఉద్యోగులు నిర‌స‌న‌కు దిగారు. బుధ‌వారం నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె బాట ప‌ట్టారు. యూనివ‌ర్శిటీ నిధుల మ‌ళ్లింపుకు నిర‌స‌న‌గా రేప‌టి నుంచి విధులు బ‌హిష్క‌రించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో యూనివ‌ర్శిటీ ఉద్యోగ‌, విద్యార్థి సంఘాలు ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితిగా ఏర్ప‌డ్డాయి. యూనివ‌ర్శిటీ ప్రాంగణంలో ఉద్యోగులు నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టారు. ఈ ర్యాలీకి విద్యార్థి సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి. వీసీ, రిజిస్ట్రార్ కు వ్య‌తిరేకంగా ఉద్యోగులు ఆందోళ‌న చేశారు. యూనివ‌ర్శిటీ ప‌రిణామాల‌పై గ‌వ‌ర్న‌ర్ కు నివేదిస్తామ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు తెలిపారు. సీఎంవో ఒత్తిడితోనే యూనివ‌ర్శిటీ నిధులు మ‌ళ్లిస్తున్నార‌ని ఉద్యోగులు ఆరోపించారు.

About Author