PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌న్ మ‌త‌మార్పిడులు ప్రోత్స‌హిస్తున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై న‌టి మాధ‌వీల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌త‌మార్పిడులు ప్రోత్స‌హిస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ‘‘పవన్ కళ్యాణ్ గారు..క్రిస్మస్ విషెస్ చెప్పండి.. నమ్మినవారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం… మానవాళికి లాంటి పెద్దమాటలు ఎందుకండి..? మతమార్పిడిలకు ఎంకరేజ్మెంట్ చేసేలా వుంది మీ పోస్ట్..విషెస్ పెట్టండి చాలు.. బైబిల్‌ని మనమే బోధించనక్కర్లేదు. అక్కడ ఎవరూ దేవుడు లేరు. రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే.. మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. సర్వ ప్రాణుల పట్ల అని ఏసు చెప్పలేదు. ఆయన చెప్పారని నేనూ మొన్నటిదాకా మీలాగే నమ్మా.. కానీ, యూదుల వరకే ఆయన ప్రేమ. మనం యూదులం కాదు. మీ పేజి మెయిన్‌టేన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది. . ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను.’’ అంటూ మ‌ధ‌వీల‌త సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

                             

About Author