PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూడుల్స్ ఫ్యాక్ట‌రీలో పేలుడు.. ఆరుగురు మృతి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీహార్ లోని ముజ‌ఫ‌ర్ పూర్ లో భారీ ప్ర‌మాదం చోటుచేసుకుంది. నూడుల్స్ ఫ్యాక్ట‌రీలో భారీ శ‌బ్ధంతో బాయిల‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న సంభ‌వించింది. ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటరు దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సమాచారంతో. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పైగా దెబ్బతిన్న బాయిలర్‌ నుండి పొగ ఇప్పటికి వస్తునే ఉందని అధికారులు అన్నారు. పేలుడులో మ‌రణించిన వారికి బీహార్ సీఎం నితీష్ కుమార్ 4 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు.

                                      

About Author