NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రంలో అల్ల‌ర్ల‌కు కుట్ర !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో అల్ల‌ర్లు సృష్టించేందుకు వైకాపా కుట్ర ప‌న్నుతోంద‌ని టీడీపీ నేత ప‌త్తిపాటి పుల్లారావు ఆరోపించారు. పరిపాలన చేతగాక దుర్మార్గాలకు సీఎం జగన్ విధ్వంసాలకు పాల్పడుతున్నాడన్నారు. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని రంగంలోకి దించి రాష్ట్రంలో విధ్వంసాలకు కుట్ర చేస్తున్నారన్నారు. తాడికొండ, దుర్గి లలో ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం… చిత్తూరులో టీడీపీ దిమ్మె ధ్వంసం వంటి ఘటనలే దీనికి సాక్ష్యమని ప్రత్తిపాటి పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు.

                                          

About Author