PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువ‌త‌లో విద్వేషం పెంచుతున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దేశంలో విద్వేషాన్ని పెంచిపోషిస్తున్నార‌ని ఆరోపించారు. బీజేపీ విద్వేష క‌ర్మాగారాలున‌డుపుతోంద‌ని వ్యాఖ్యానించారు. ఆ కార్ఖానాల్లో ‘ టెక్‌ ఫాగ్‌’ కూడా ఒకటని పేర్కొన్నారు. ‘ ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసి, వారిపై అంతగా విద్వేషం పెంచుకున్న బుల్లి బాయ్‌ యాప్‌ నిర్వాహకుడు చాలా తక్కువ వయసు వాడు. యువతలో విద్వేషం పెంచేస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో విద్వేషం ఎక్కడి నుంచి వెదజల్లబడుతోందని యావత్‌ భారతావని ఆశ్చర్యంలో మునిగిపోయింది. నిజానికి బీజేపీ ఇలాంటి ఎన్నో కర్మాగారాలను నడుపుతోంది’ అని రాహుల్‌ ట్వీట్‌చేశారు.

                                           

About Author