PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌వ‌న్ కొడుకు అకీరాకు క‌రోన !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొడుకు అకీరా నంద‌న్ కు క‌రోన సోకింది. అకీరాతో పాటు త‌ల్లి రేణుదేశాయ్ కూడ క‌రోన బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని రేణూదేశాయ్ ఇన్ట్సాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే కోవిడ్‌ పాజిటివ్‌ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. నేను ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నా నాకు కరోనా సోకింది. అకీరాకి వ్యాక్సిన్‌ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కూడా కరోనా వచ్చింది. ఈ థర్డ్‌ వేవ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోండి. మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండిస‌ అంటూ రేణు దేశాయ్‌ పేర్కొన్నారు.

                                          

About Author