PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీం ఆర్మీ యూట‌ర్న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన భీం ఆర్మీ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంది. ఈ మేర‌కు భీం ఆర్మీ వ్య‌వ‌స్థాప‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ ప్ర‌క‌ట‌న చేశారు. దళితులను అఖిలేష్ కేవలం ఓట్ బ్యాంక్‌గానే చూస్తున్నారని, వారిని ఎన్నికల బరిలోకి ఆహ్వానించడం లేదని భీంఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ శనివారం అన్నారు. దీనికి ముందు బీజేపీని ఓడించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని, అందుకు అఖిలేష్‌ కూటమికి తాము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. యూపీ ఎన్నిక‌ల్లో భీం ఆర్మీ ఎవ‌రికి మ‌ద్దతు ప్ర‌టిస్తుంద‌న్న ఆస‌క్తి రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కొంది.

                                        

About Author