PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడాకారులను ప్రోత్సహించాలి : సర్పంచ్​ గంజర్ల గంగాధర్​ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్​: గ్రామీణ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సర్పంచ్​ గంజర్ల గంగాధర్​ రెడ్డి.  ఆదివారం గడివేముల మండలం పరిధిలోని పైబోగుల గ్రామంలో టిడిపి సర్పంచ్ గంజర్ల గంగాధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ ఆట ఆడడం వల్ల యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని,యువత  గ్రామ క్రీడల్లో పాల్గొనాలని తెలిపారు. కబడ్డీ ఆటలో పాల్గొనేందుకు వివిధ గ్రామాల నుండి 10 టీములు రాగా అందులో మొదటి బహుమతి 10,016/- రూపాయలనుపై పైబోగుల గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులకు గంజర్ల గంగాధర్ రెడ్డి బహుమతి ప్రధానం చేశారు. రెండవ బహుమతి 5,016/- రూపాయలను ఒందుట్ల గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులకు గంజర్ల గణేష్ రెడ్డి  బహుమతి ప్రధానం చేశారు.

About Author