PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత

1 min read

పల్లెవెలుగువెబ్ : కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుడివాడలో క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని టీడీపీ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ పర్యటించనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఆనంద్ బాబు, వర్లరామయ్య, కొల్లురవీంద్ర, బొండాఉమ, ఆలపాటిరాజా, తంగిరాల సౌమ్యతో కూడిన కమిటీ క్యాసినో నిర్వహించిన ప్రాంతంలో పర్యటించనుంది. అనంతరం పూర్తీ నివేదికను టీడీపీ అధిష్టానానికి సమర్పించనుంది. క్యాసినో నిర్వహణ పై టీడీపీ నేత బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ కార్యాలయానికి సమీపంలో ఇలాంటి ఘటన జరిగినా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

             

About Author