PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారతీయుడిగా సిగ్గనిపించడం లేదా !

1 min read

పల్లెవెలుగువెబ్ : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. గుంటూరులోని జిన్నా టవర్ మీద జాతీయ జెండా ఎగురవేయనందుకు మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎప్పుడు గుర్తొచ్చిందన్నది అసలు విషయం కాదని, జరిగిన తప్పును సరిదిద్దటానికి ప్రయత్నిస్తున్నామా లేదా అన్నదే అసలు విషయమని, దాన్ని మంత్రి శ్రీనివాస్ తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగురవేయకుండా పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఓక భారతీయ పౌరుడుగా మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ఆయన నిలదీశారు. దేశ విద్రోహక శక్తులకు మీరు కొమ్ముకాస్తున్నారనేది వాస్తవమని ఆయన పేర్కొన్నారు.

       

About Author