PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముందస్తు.. హామీ..!

1 min read
వార్డులో పర్యటిస్తున్న వైసీపీ నాయకులు

వార్డులో పర్యటిస్తున్న వైసీపీ నాయకులు

– సమస్యలు చెప్పండి… పరిష్కరిస్తాం..
– వార్డు పర్యటనలో వైసీపీ నాయకుల హామీ
పల్లెవెలుగు, కర్నూలు;
ఓ వైపు గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. మున్సిపల్​ పరిధిలోని వైసీపీ, టీడీపీ నాయకుల్లో అలజడి మొదలైంది. జీ.పీ. ఎన్నికల తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ వెనువెంటనే.. మున్సిపల్​ పరిధిలోని ఎన్నికలు జరుగుతాయని సంకేతాలు వెలువడటంతో .. నాయకులు తమ తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. గురువారం స్థానిక బుధవార పేటలో ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ ఆదేశాల మేరకు.. ఆ వార్డు సమన్వయకర్త కేదర్నాథ్​ కార్యకర్తలతో కలిసి వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో 15వ వార్డు ఇంచార్జీ వెంకటేశ్వరమ్మ, వాణి, వరలక్ష్మి, నాగమణి, సురేఖ, జశ్వంత్, వసంత్, దినకర్, శంకర్ పాల్గొన్నారు.


About Author