PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏడేళ్లుగా ఎంపీ.. అద్దె ఇంట్లో జీవనం !

1 min read

పల్లెవెలుగువెబ్ : పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భగవంత్ మాన్ తరపున కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్ లో ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ అయితే మూడు, నాలుగు అంతస్థుల భవంతులు, నాలుగైదు కార్లు ఉంటాయని, కానీ భగవంత్ మాన్ ఏడేళ్లుగా ఎంపీగా కొనసాగుతున్నా అతి సాధారణ జీవితమే గడుపుతున్నారని అన్నారు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే జీవనం గడుపుతున్నారని ప్రశంసించారు. పంజాబ్ ను కాంగ్రెస్ 26 ఏళ్లు దోచుకుంటే.. బాదల్ కుటుంబం 19 ఏళ్ల పాటు దోచుకుందని విమర్శించారు. ఈ సమయంలో నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రి రావడం పెద్ద అవసరంగా మారిందన్నారు.

    

About Author