PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ గీతాన్ని అవమానించిన సీఎం.. సమన్లు జారీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : జాతీయ గీతాన్ని అవమానపరిచారన్న ఆరోపణలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ముంబై మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల దాఖలైన కేసులో మార్చి 2న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. . కాగా డిసెంబరు 1, 2021న ముంబైలో ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానించారని మహారాష్ట్రకు చెందిన బీజేపీ కార్యకర్త, న్యాయవాది వివేకానంద గుప్తా ఆరోపించారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మెజిస్ట్రేట్‌ కోర్టును కోరారు.

     

About Author