NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దృష్టి మళ్లించడానికే ఎన్టీఆర్ పేరు : బాలకృష్ణ

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రజల దృష్టి మళ్లించడానికే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. జిల్లాల ప్రకటన తర్వాత ఎక్కడపడితే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. దానిపైన ఎలాంటి యాక్షన్ లేదన్నారు. ఎన్టీఆర్ అంటే అంత గౌరవం ఉంటే ఇలా చేస్తారా..? అని బాలయ్య ప్రశ్నించారు. దీనిని కేవలం పొలిటికల్ స్టంట్‌గా కొట్టిపారేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పెట్టడం.. ఏ ప్రేమతో పెట్టారు అందరికీ తెలిసిందేనన్నారు. నిజమైన ప్రేమ ఉంటే చంద్రబాబు ఎన్టీఆర్ పెట్టిన పథకాలను కంటిన్యూ చేయాలని బాలయ్య డిమాండ్ చేశారు.

       

About Author