PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరోయిజం కోసం ఆందోళన చేస్తే ఎలా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉపాధ్యాయుల ఆందోళన పై స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన మీటింగ్‌లో ఉపాధ్యాయులు అన్నిటికీ ఒప్పుకున్నారన్నారు. ఉపాధ్యాయుల పాత్ర ఒక్కటే ఉద్యమంలో ఉందనే ప్రచారం జరుగుతోందని, రాజు గారి బిందెలో అందరూ పాలుపోసినట్టుగా ఉందన్నారు. ఏదో హీరోయిజం కోసం ఆందోళన చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. బుధవారం స్టీరింగ్ కమిటీ భేటీ ఉందని, ఆ సమావేశంలో అన్ని అంశాలు చర్చిస్తామన్నారు. ఉపాధ్యాయులు రాజకీయ ప్రయోజనం కోసం చూస్తున్నట్టు ఉన్నారని విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఓట్లు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సూర్యనారాయణ ఆరోపించారు.

       

About Author