PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉరవకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వివాహ వేడుకకు ఇన్నోవా వాహనంలో బళ్లారి నుంచి నింబగల్లుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

      

About Author