NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొన్ని గంట‌ల్లో శ‌త్రుసేన‌లు ముట్ట‌డించే అవ‌కాశం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యన్ దళాలు సమీపిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శుక్రవారం చెప్పారు. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంటును స్వాధీనం చేసుకున్న తర్వాత కీవ్ వైపు శత్రు బలగాలు వస్తున్నాయన్నారు. కీవ్ నగరాన్ని మరో 96 గంటల్లో శత్రు సేనలు ముట్టడించే అవకాశం ఉందన్నారు. యూరోపుపై నూతన ఉక్కు తెరను వేయబోతున్నారని మండిపడ్డారు. అంతకుముందు ఉక్రెయిన్ ప్రధాన మంత్రి డెనిస్ ష్మిహాల్ మాట్లాడుతూ, చెర్నోబిల్ ఎక్స్‌క్లూజన్ జోన్, చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణాలను రష్యన్ సేనలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

                                  

About Author