PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూపీలో ఆస‌క్తిక‌ర పోరు సాగుతోంది. ఉదయం 10 గంటల సమయానికి వచ్చిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 250 సీట్లలో ముందంజలో ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ 112 సీట్లలో ముందంజలో ఉంది. బీఎస్పీ 8 సీట్లలో కాంగ్రెస్ మరో 8 సీట్లలో ముందంజలో ఉన్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ రెండు పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. ఇక ఇతరులు మరో 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇంకా 16 సీట్లలోని పరిస్థితి గురించి సమాచారం రావాల్సి ఉంది. మొత్తానికి ఈసారి కూడా బీజేపీ అనూహ్య రీతిలో అంచనాలకు మించిన విజయాన్ని నమోదు చేయడం ఖాయమని బీజేపీ నేతలు తేల్చిచెబుతున్నారు.

                                   

About Author