PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీల్లో ఎంట్రెన్స్ టెస్ట్ ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలోని 45 సెంట్రల్ యూనివర్సిటీలకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశానికి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. ఈ ఏడాది అడ్మిషన్లకు సంబంధించిన పరీక్ష వచ్చే జూలై మొదటివారంలో జరుగుతుందని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ సోమవారం వెల్లడించారు. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహిస్తుందని, పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని చెప్పారు. +2 లేదా ఇంటర్మీడియెట్ మార్కులకు ఎలాంటి వెయిటేజీ ఉండదని, ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. అడ్మిషన్లకు సంబంధించి కౌన్సెలింగ్ ఉండదని, మెరిట్ లిస్ట్ ఆధారంగానే విద్యార్థుల్ని చేర్చుకుంటామని చెప్పారు.

                              

About Author